చికిత్స పొందుతూ అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

చికిత్స పొందుతూ అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

 అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ జూలై 7 2024 ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగడం వల్ల రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, డయాలసిస్ చేస్తున్నారని, లివర్ కూడా దెబ్బతిందని ఆయన బంధువులు తెలిపారు.

 ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు ఎస్సై తన మొబైల్​నుంచి బంధువులకు, స్నేహితులకు ఓ మెసేజ్​పంపించాడు. అందులో ‘ఉన్నతాధికారులు వేధింపులు, సహచర సిబ్బంది చేసిన అవమానాలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆఖరి క్షణాన భార్యాబిడ్డలు గుర్తుకురావడంతో బతకాలి అనిపించి ఇప్పుడే108కి ఫోన్​చేశా. నా ఫోన్​లో అన్ని ఆధారాలున్నాయి. నా రివాల్వర్​ను పోలీస్​ స్టేషన్​లో సరెండర్ చేశా. పత్రికల్లో నాపై వార్తలు రాయించి అవినీతిపరుడిగా చిత్రీకరించారు. వేధింపుల గురించి డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. అందుకే సూసైడ్​ చేసుకుంటున్నా’ అని వాట్సాప్ ​చేశాడు. 

ప్రస్తుతం ఎస్సై ఫోన్​ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.