
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కల్పించిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై బెంగళూరు నగర కమిషనర్కి సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
సీఎం ‘జీరో ట్రాఫిక్’ ప్రోటోకాల్ కారణంగా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించి ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు. గతంలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ను తిరస్కరించారు.
2023 మే 21 ఆదివారం రోజున కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులో ఓ యువతి మృతి చెందిన వెంటనే సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు . భానురేఖ అనే యువతి తన కుటుంబంతో కలిసి కారులో KR సర్కిల్ అండర్పాస్ గుండా ప్రయాణిస్తుండగా అండర్పాస్ లో కారు మునగింది.
ఈ ఘటనలో భానురేఖ చనిపోయింది. అయితే ఆమెతో పాటు మరో ఐదుగురిని సిబ్బంది రక్షించారు. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. భానురేఖ బెంగుళూరులోని ఇన్ఫోసిస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది.
మరోవైపు 2023 మే 20న కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా మరో నిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 136 సీట్లతో అధికారంలోకి వచ్చింది.