కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య : కేసీ వేణుగోపాల్

కర్ణాటక  కొత్త సీఎంగా సిద్ధరామయ్య : కేసీ వేణుగోపాల్

కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేసినట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.   సీఎం ఎంపికపై  డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పార్టీ హైకమాండ్ చర్చలు జరిపిందన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా కొనసాగుతారని వెల్లడించారు.  

మే 20న  సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు మరి కొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.  ఇవాళ సాయంత్రం జరిగే సీఎల్పీ భేటీలో సిద్ధరామయ్యను సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని చెప్పారు.  

కర్ణాటకలో  పార్టీ విజయానికి విజయానికి రాహుల్ గాంధీ ,ప్రియాంక తోడ్పడ్డారని చెప్పారు.  కర్ణాటకలో అందరూ కలిసి పనిచేశారని చెప్పారు.  ఏఐసీసీ చీఫ్ ఖర్గే నెల రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారని తెలిపారు.  కర్ణాటక విజయంతో కాంగ్రెస్ జోష్ లోకి వచ్చిందన్నారు.