నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి : కలెక్టర్​ మనుచౌదరి

నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి : కలెక్టర్​ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్​లో పోలీస్​, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు సాగుపై దృష్టిపెడుతున్నారన్నారు. ఇదే సమయంలో దళారులు, వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రమాదం పొంచి ఉందన్నారు. అలా జరగకుండా టాస్క్​ఫోర్స్​ కమిటీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఫర్టిలైజర్​షాపుల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని, లైసెన్స్​డ్​డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హుస్నాబాద్​ మార్కెట్​ కమిటీలో జూన్​ 4 నుంచి 6 వరకు కిసాన్​మేళాలో 130 స్టాల్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ గరిమ అగర్వాల్, అబ్దుల్​హమీద్, రాధిక పాల్గొన్నారు.