
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లాలో రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు సాగుపై దృష్టిపెడుతున్నారన్నారు. ఇదే సమయంలో దళారులు, వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రమాదం పొంచి ఉందన్నారు. అలా జరగకుండా టాస్క్ఫోర్స్ కమిటీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫర్టిలైజర్షాపుల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని, లైసెన్స్డ్డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో జూన్ 4 నుంచి 6 వరకు కిసాన్మేళాలో 130 స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అబ్దుల్హమీద్, రాధిక పాల్గొన్నారు.