
సిద్దిపేట రూరల్, వెలుగు: కేసుల పరిశోధన పారదర్శకంగా జరగాలని, మత్తు పదార్థాలపై మరింత నిఘాపెట్టి డ్రగ్స్రహిత జిల్లాకు అధికారులు కృషి చేయాలని సీపీ అనురాధ పోలీస్అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ ఆఫీస్ లో పెండింగ్ కేసులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ప్రో యాక్టివ్ పోలీస్ సింగ్ పై దృష్టిపెట్టి నేరాలను తగ్గించాలని, బక్రీద్ సందర్భంగా చెక్ పోస్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘాపెట్టి చోరీ కేసులను ఛేదించాలన్నారు.
వృద్ధులు, వికలాంగులు పీఎస్కు వచ్చినప్పుడు ఎస్ఐలు, సీఐలు వారి వద్దకు వెళ్లి సమస్యను విని పరిష్కరించాలని సూచించారు. జూన్ 14న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున ఐడెంటిఫై చేసిన కేసులన్నీ పరిష్కరించాలని, వనమహోత్సవం సందర్భంగా ప్రతీ పీఎస్లో మొక్కలు నాటాలని ఆదేశించారు.
పోలీస్, సిబ్బందికి ప్రోత్సహకాల అందజేత
జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 31 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డ్స్ అందజేశారు. గౌరారం పీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రామకృష్ణ, గౌతమ్ ను అభినందించి అప్రిసియేషన్ సర్టిఫికెట్ తో పాటు నగదు రివార్డు అందజేశారు. గతేడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ కింద రూ. 1 కోటి ఇన్సూరెన్స్ చెక్కును ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మారుతితో కలసి అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, నర్సింలు, సదానందం పాల్గొన్నారు.