కాంగ్రెస్‌‌‌‌ పాలనేంటో ప్రజలకు తెలిసింది: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

కాంగ్రెస్‌‌‌‌ పాలనేంటో ప్రజలకు తెలిసింది: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట, వెలుగు: అబద్ధాలు చెప్పడంతో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌గౌడ్‌‌‌‌ పోటీ పడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌‌‌‌రెడ్డి పాలన చూశాక ప్రజలకు అన్ని విషయాలు తెలిశాయని, తెలంగాణలో మరో పదేండ్ల వరకు కాంగ్రెస్‌‌‌‌ విత్తనమే లేకుండా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌‌‌‌ మండల యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్‌‌‌‌ పాటిల్‌‌‌‌ బుధవారం సిద్దిపేట క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో హరీశ్‌‌‌‌రావు సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ పాలన చూశాక మళ్లీ ‘కేసీఆరే రావాలి.. కావాలి’ అంటూ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

రైతు బంధు ఎగ్గొట్టిన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ సవాల్‌‌‌‌ చేసిన బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని.. ఎక్కడికి రావాలో ఆయనే చెప్పాలన్నారు. ఓడిపోతామన్న భయంతోనే లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. బనకచర్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌‌‌‌కు లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు అంతా కలిసి ముందుకుపోవాలని సూచించారు.