తెలుసు కదా మూవీ షురూ

తెలుసు కదా  మూవీ షురూ

సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్స్‌‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. టీజీ విశ్వప్రసాద్‌‌ నిర్మాత.  వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. బుధవారం ఈ సినిమాను ప్రారంభించారు. హీరో నాని ముహూర్తపు షాట్‌‌కి క్లాప్ కొట్టాడు. హీరోలు నితిన్, ఆది పినిశెట్టి స్క్రిప్ట్‌‌ని మేకర్స్‌‌కి అందజేశారు.

దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌‌కు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నందిని రెడ్డి, కోన వెంకట్, వక్కంతం వంశీ, బొమ్మరిల్లు భాస్కర్, మల్లిక్ రామ్, సితార నాగ వంశీ, నిర్మాత విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌. త్వరలో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.