సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ‘ఎక్స్ క్యూజ్ మీ రాక్షసి …’ను హీరో సిద్ధార్థ్ పాడాడు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయిందని..ఈ మూవీకి సిద్ధార్థ్ సాంగ్ పాడటంతో సినిమాకి మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయని తెలిపింది యూనిట్.
సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “తెలుగు పరిశ్రమ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను. నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా… నటుడిగా. తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసం నేను పాట పాడాను’ అని తెలిపాడు.
సిద్ధార్ద్ ఇంతకు ముందు కూడా పలు సినిమాల్లో పాడాడు. కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్.