
హైదరాబాద్, వెలుగు: వెండి నగలు అమ్మే ఒరాఫో శనివారం ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసింది. కన్జూమర్లు ఒరాఫోజ్యుయెల్స్డాట్ఇన్లోకి వెళ్లి సిల్వర్ నగలను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా బలగం మూవి హీరోయిన్ కావ్య కళ్యాణ్రామ్ హాజరయ్యారు. ఒరాఫో జ్యుయెల్స్కు సోమాజిగూడా, సుచిత్ర ఎక్స్ రోడ్స్లో సొంత షారూమ్లు ఉన్నాయని, ఏఎస్ రావు నగర్లో ఫ్రాంచైజీ బేసిస్లో ఓ స్టోర్ ఉందని కంపెనీ డైరెక్టర్ కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న రూ.5.75 కోట్ల రెవెన్యూని ఇంకో మూడేళ్లలో రూ.50 కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.