సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు. విమెన్స్ సింగిల్స్లో ఐదోసీడ్గా బరిలోకి దిగిన సింధు 12–21, 17–21తో నాలుగోసీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో కంగుతిన్నది.
గతంలో జాంగ్తో తలపడిన పది మ్యాచ్ల్లో ఆరుసార్లు నెగ్గిన తెలుగమ్మాయి ఈసారి విజయం సాధించలేకపోయింది. మెన్స్ క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్ 13–21, 8–21తో ఇండియాకు చెందిన ప్రియాన్షు రజావత్ చేతిలో ఓడాడు. మరో మ్యాచ్లో ఆరోసీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 16–21, 21–17, 21–14తో టాప్సీడ్ ఆంథోని సిన్సుకా గింటింగ్ (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రణయ్.. ప్రియాన్షుతో తలపడతాడు.