హైదరాబాద్ నుంచి సింగపూర్కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూపు ప్రకటించింది. హైదరాబాద్కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా సంస్థ సర్వీసుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందుకు బోయింగ్ 737 –8 విమానాలను వినియోగిస్తామని చెప్పింది.
ఎకానమీలో 144 సీట్లు, బిజినెస్ క్లాస్లో 10 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి సర్వీసులకు ఎయిర్బస్ విమానాలను వాడతామని తెలిపింది. వీటిలో 303 సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్లో 40, ఎకానమీలో 263 సీట్లు ఉంటాయని సంస్థ జీఎం సై యెన్ చెన్ చెప్పారు.
అక్టోబర్ 29వ తేదీ నుంచి 96 వీక్లీ ఫ్లైట్లను హైదరాబాద్ సహా తొమ్మిది నగరాల నుంచి నడుపుతామని వెల్లడించారు. అయితే.. స్కూట్ విమానాలు ఇక మీదట హైదరాబాద్ నుంచి ఉండవని, ఇతర నగరాలను నుంచి సేవలు అందిస్తాయని చెప్పారు.
ALSO READ: ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్: ఇకపై రిజర్వేషన్ టిక్కెట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
ప్రస్తుతం వారానికి ఏడు సర్వీసులు నడుస్తుండగా.. అక్టోబర్ 29వ తేదీ నుంచి మరో ఐదు సర్వీసులు పెంచుతామని సింగపూర్ ఎయిర్లైన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ సే యెన్ చెన్ తెలిపారు. సంస్థ అనుబంధ విభాగం స్కూట్ రోజువారి సర్వీసులను నిలిపివేసిన క్రమంలో ఈ సర్వీసుల పెంపు కలిసిరానున్నది.