- నాలుగు నెలల్లోనే సత్పలితాలు3,35,485 యూనిట్ల
- విద్యుత్నిల్వతో సంస్థకు రూ.25.66 లక్షల మిగులు
- ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
కోల్బెల్ట్, వెలుగు: సోలార్విద్యుత్ను నిల్వ చేసి సద్వినియోగం చేసుకునే వినూత్న ప్రయోగం ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్సిస్టం’ సింగరేణికి సిరులు కురిపిస్తోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని 28మెగావాట్ల సోలార్ప్లాంట్లో తొలిసారిగా సింగరేణి యాజమాన్యం మెగావాట్సామర్థ్యంతో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్సిస్టం(బీఈఎస్ఎస్) సత్ఫలితాలనిస్తోంది. దీనిద్వారా పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్విద్యుత్లో వినియోగించుకోని విద్యుత్ను ఫ్రీగా గ్రిడ్కు సప్లై చేయకుండా, బ్యాటరీలో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకునే వ్యవస్థను రూపొందించారు. ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిదిగా గుర్తింపు పొందింది. నాలుగు నెలల కాలంలో స్థానిక అవసరాలకు విద్యుత్ను వినియోగించగా మిగిలిన యూనిట్లను బీఈఎస్ఎస్ద్వారా నిల్వ చేయడంతో సింగరేణి సంస్థకు ఏకంగా రూ.25.66 లక్షల లబ్ధి చేకూరింది.
వృథాను అరికట్టేందుకే..
సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రిలోని మైన్స్, కార్మికవాడల అవసరాల కోసం 28 మెగావాట్ల సోలార్ప్లాంట్ను ఐదేండ్ల క్రితం ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఉత్పత్తయ్యే సోలార్ పవర్ను మందమర్రి, శ్రీరాంపూర్ఏరియాల్లోని 11 అండర్గ్రౌండ్మైన్స్, 4ఓపెన్కాస్ట్గనులు, ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ ప్లాంట్తో రోజుకు సగటున లక్షా 34 వేల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుఓ సుమారు లక్షా 14వేల యూనిట్లను కంపెనీ వినియోగించుకుంటోంది. కాగా మిగతా దాదాపు 20 వేల యూనిట్లు వృథా అవుతోంది. మధ్యాహ్నం వేళ కార్మికులకు భోజన విరామ సమయం ఉండడం, యంత్రాలు కూడా విశ్రాంతిగా ఉండటం వల్ల కరెంట్ను వినియోగించడంలేదు.
దీన్ని స్థానిక సబ్ స్టేషన్ ద్వారా తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)కు ఫ్రీగా అందజేయాల్సి వస్తోంది. ఇన్హౌజ్క్యాప్టివ్పవర్ప్లాంట్ద్వారా ఈ మిగులు విద్యుత్.. రాష్ట్ర విద్యుత్శాఖ లైన్లలో కలుస్తోంది. కాబట్టి ఈ కరెంటుకు డిస్కం ఎలాంటి ఛార్జీలు చెల్లించడంలేదు. ఇలా ఫ్రీగా పోతున్న 20 వేల యూనిట్ల సోలార్విద్యుత్ను సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించి ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌజ్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్ గ్రిడ్లకు అనుసంధానం చేసింది.
నాలుగు నెలల క్రితం ప్రారంభం
గతంలో సింగరేణి సంస్థ శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని 15 గనుల అవసరాలకు నెలకు రూ.13కోట్ల విలువైన విద్యుత్ను డిస్కం నుంచి కొనుగోలు చేసేది. కాగా 2021 ఏప్రిల్17న 28 మెగావాట్ల సోలార్పవర్ప్లాంట్ ఏర్పాటు చేసి సొంత అవసరాలకు కూడా ఇదే పవర్ను వినియోగించడంతో నెలకు రూ.4 కోట్లు ఆదా అవుతోంది. మిగిలిన 20వేల యూనిట్ల కరెంట్ను ఎలాంటి ప్రయోజనం లేకుండా గ్రిడ్కు సరఫరా చేయాల్సి వచ్చింది. అయితే ఈ మిగులు విద్యుత్ను కూడా సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర సర్కార్ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా మందమర్రిలోని 28 మెగావాట్ల ప్లాంట్కు అనుబంధంగా రూ.2.5 కోట్లు వెచ్చించి ఒక మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంను పైలట్ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు.
నాలుగు నెలల కాలంలో స్థానిక అవసరాలకు విద్యుత్ను వినియోగించగా మిగిలిన 3,35,485 యూనిట్లను బాటరీ ఎనర్జీ సిస్టం ద్వారా నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వినియోగించుకుంది. తద్వారా సంస్థకు రూ.25,66,460 లబ్ధి చేకూరింది. ఒక మెగావాటు సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేస్తూ విజయవంతమవడంతో సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సింగరేణిలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు గురువారం ప్రకటించింది.
