భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆఫీసర్ వేధింపులతో సింగరేణి కొత్తగూడెంలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ వర్కర్ ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలితో పాటు దళిత సంఘాల నాయకులు ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా సర్వే డిపార్ట్మెంట్లో నాలుగేండ్లుగా ఎన్. మంజుల కాంట్రాక్ట్ వర్కర్గా చేస్తోంది. కొద్ది రోజులుగా సర్వే డిపార్ట్మెంట్లోని జీఎం స్థాయి ఆఫీసర్ ఆమెను వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. శనివారం ఆఫీస్ఆవరణలో టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది చూసిన తోటి వర్కర్స్ఆమెను సింగరేణి మెయిన్హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు ట్రీట్మెంట్చేస్తున్నారు. ఇన్టైంలో ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని దళిత సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దళిత మహిళా వర్కర్ను వేధించిన ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని మాదిగ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూసపాటి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్అసోసియేషన్స్టేట్ జనరల్సెక్రటరీ అంతోటి నాగేశ్వర రావు, మహిళా సంఘం నాయకులు కె. రత్నకుమారి, బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్యెర్రా కామేశ్ డిమాండ్ చేశారు.