కరీంనగర్ భగత్ నగర్ లో తనను ఇల్లు కట్టుకోనీయకుండా సీఎం కేసీఆర్ బంధువు చీటీ రామరావు అనే వ్యక్తి వేధిస్తున్నాడని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కొత్త రాజిరెడ్డి ఆరోపించారు. చీటీరామారావు అర్ధరాత్రి కొంతమందితో వచ్చి తమ ఇంటి నిర్మాణం కోసం తవ్వుకున్న పిల్లర్ గుంతలను పూడ్చారని ఆరోపించారు. టీఎస్ బీపాస్ లో ఇంటి నిర్మాణానికి గతంలో అనుమతిచ్చి రద్దు చేశారని రాజిరెడ్డి చెప్పారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, మంత్రి గంగులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని రాజిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని .. పోలీసులు రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని రాజిరెడ్డి దంపతులు కోరుతున్నారు.