చిన్నారులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి : చింతల శ్రీనివాస్

చిన్నారులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి : చింతల శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు: చిన్నారులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సింగరేణి ఆర్జీ 1 ఏరియా జనరల్​ మేనేజర్​ చింతల శ్రీనివాస్​ అన్నారు. నెల రోజులుగా వర్క్​ పీపుల్స్​ స్పోర్ట్స్​ అండ్​ గేమ్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలకు స్థానిక జేఎన్‌‌‌‌ స్టేడియంలో నిర్వహించిన సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపు శనివారం ముగిసింది. 

ఈ సందర్భంగా జీఎం చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా పాల్గొని వివిధ క్రీడల్లో పాల్గొన్న చిన్నారులకు టీ షర్ట్స్​ అందజేశారు. ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడలతో పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుతారన్నారు. కార్యక్రమంలో పర్సనల్​ ఏజీఎం సీహెచ్​ లక్ష్మీనారాయణ, ఎస్‌‌‌‌వోటు జీఎం రామ్మోహన్​, కోల మల్లేశ్, బాలసుబ్రమణ్యం, రంగు శ్రీనివాస్​, బంగారు సారంగపాణి, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.