- అధికారులు అధ్యయనం చేయాలని సీఎండీ బలరామ్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: దేశంలోని పలు రాష్ట్రాల్లో సోలార్పవర్ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సింగరేణి కాలరీస్సంస్థ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, గుజరాత్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో సోలార్ప్లాంట్ల ఏర్పాట్లపై అధికారులు అధ్యయనం చేయాలని సింగరేణి సీఎండీ బలరామ్ సూచించారు. ఇతర సంస్థలతో కలిసి జాయింట్వెంచర్ప్రాజెక్టులు చేపట్టడానికి ఉన్న అవకాశాలపై ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని సీఎండీ బలరామ్ అధికారులను ఆదేశించారు. శనివారం థర్మల్, సోలార్పవర్ప్లాంట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు.
జైపూర్పవర్ప్లాంట్ఆవరణలో 800 మెగావాట్ల సూపర్క్రిటికల్థర్మల్ప్లాంట్టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అక్కడే రూ.700 కోట్లతో చేపట్టిన ఫ్లూ గ్యాస్డీ సల్ఫరైజేషన్ప్లాంట్పనుల పురోగతిని ఆరా తీశారు. సమావేశంలో ఉన్నతాధికారులు సత్యనారాయణ, జేఎన్సింగ్, జానకీరామ్, సూర్యనారాయణ, విశ్వనాథ రాజు, సుధాకర్, కొండారెడ్డి, ప్రసాద్తదితరులు పాల్గొన్నారు.