గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్పరిధిలోని జీడీకే 1వ గనిలో సోమవారం కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ మహిళా కార్మికురాలు తన తోటి మహిళా కార్మికురాళ్లను, కార్మికులను అవమానించేలా వ్యవహరించిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయం హాజరు వేశాక మైన్లోకి ఎవరూ వెళ్లకుండా పనులు బంద్ చేశారు.
అనంతరం జీఎం లలిత్కుమార్ను కలిసి కార్మికులు చర్చించారు. సదరు మహిళా కార్మికురాలిపై చర్యలు తీసుకుంటూ జీడీకే 1వ గని నుంచి సీహెచ్పీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కార్మికులు ఆందోళనను విరమించారు.
