
‘అఖండ’ చిత్రంలోని ‘జై బాలయ్య’ పాటతో సహా పలు సూపర్ హిట్ సాంగ్స్తో సింగర్గా రాణిస్తున్న అదితి భావరాజు.. ఇప్పుడు నటిగా పరిచయం అవుతోంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ‘దండోరా’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కలర్ఫొటో, బెదురులంక 2012 చిత్రాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. బలమైన ప్రేమకథతోపాటు కఠినమైన నిజాలను, సామాజిక దురాచారాలను ఇందులో చూపించబోతున్నామని మేకర్స్ చెప్పారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.