
ప్రముఖ గాయని గీతా మాధురి(Geetamadhuri ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు గీతా మాధురి. ఇటీవలే ఆమె సీమంతం వేడుక జరుగగా.. ఫిబ్రవరి 10న బాబుకి జన్మనిచ్చారట గీతా మాధురి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ గీతా, నందు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక నందు, గీతా మాధురి ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. 2014లో వీరి వివాహం జరగగా.. 2019 పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండోసారి మెగా బిడ్డకు జన్మనిచ్చారు గీతామాధురి.