సింగర్ లతా మంగేష్కర్ ఇంటికి సీల్

సింగర్ లతా మంగేష్కర్ ఇంటికి సీల్

గాయని లతా మంగేష్కర్ ఇంటికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. కరోనావైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యగా లతా మంగేష్కర్ నివాస భవనం ప్రభుకుంజ్‌కు శనివారం బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సీల్ వేసింది. ఇప్పటికైతే ఆమె మరియు ఆమె కుటుంబసభ్యులు క్షేమంగానే ఉన్నారు. దీనికి సంబంధించి లతా మంగేష్కర్ కుటంబం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దయచేసి మా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఎవరూ ఎక్కువగా స్పందించవద్దు. మేం అందరం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మా అపార్ట్ మెంట్స్ లోని సీనియర్ సిటిజన్ల శ్రేయస్సు మరియు ఇతర కుటుంబాల రక్షణ కోసం ఈ చర్య తీసుకోబడింది. దేవుని దయ మరియు చాలా మంది అభిమానుల ప్రార్థన వల్ల మా కుటుంబం సురక్షితంగా ఉంది’అని తెలిపారు.

లతా మంగేష్కర్ ఇల్లు సీల్ వేయబడిందా అని శనివారం సాయంత్రం మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ‘మా అపార్ట్ మెంట్స్ లో చాలామంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. కరోనా సోకకుండా ఉండేందుకే మా ఇళ్లను సీల్ చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం అందరికీ మంచిది కదా’అని ఆమె కుటుంబసభ్యులు తమ ప్రకటనలో తెలిపారు.

For More News..

నాకు కరోనా వచ్చింది.. తగ్గింది..

సెప్టెంబర్ 1న భూమి దగ్గరగా రాబోతున్న గ్రహశకలం

పండుగలను ప్రజలు జాగ్రత్తగా జరుపుకోవాలి