ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..

ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. లిక్కర్ స్కాం కేసులో A4 గా ఉన్న ఎంపీ మోతున్ రెడ్డిని శనివారం ( జులై 19 ) అరెస్ట్ చేశారు పోలీసులు.ఆదివారం ( జులై 20 ) మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి శనివారం సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డిని 6 గంటల విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ఇప్పటికే ఓసారి నోటీసులిచ్చి మిథున్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ ఇవాళ రెండోసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది. మిథున్ రెడ్డికి సంబంధించి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సిట్ ఆయనను అదుపులోకి తీసుకుంది. మిథున్ రెడ్డిని ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జి చీట్ దాఖలు చేసింది సిట్. ఈ కేసులో సుదీర్ఘ కాలంగా  విచారణ జరిపిన శనివారం ( జులై 19 ) ప్రిలిమినరీ చార్జిషీట్ దాఖలు చేసింది. 300 పేజీలు ఉన్న ఈ చార్జిషీట్ లో ఎంపీ మిథున్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. ఈ చార్జిషీట్ లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా రూ. 62 కోట్లు సీజ్ చేసినట్లు పేర్కొంది సిట్. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 268 మంది సాక్షులను విచారించినట్లు చార్జిషీట్ లో పేర్కొంది సిట్.

20 రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది సిట్. లిక్కర్ స్కాం ద్వారా కొల్లగొట్టిన సొమ్ము వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని వెల్లడించింది సిట్. మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసారని..  బ్లాక్ ను వైట్ గా మార్చినట్లు గుర్తించామని పేర్కొంది సిట్.