సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేసులో దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వం వహించనున్నారు. బుధవారం ఆర్డర్ కాపీని ప్రభుత్వం విడుదల చేసింది. సిట్లో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్హెచ్వో లక్ష్మీరెడ్డి ఉన్నారు. మొయినాబాద్లోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. ఇప్పటికే సేకరించిన ఆడియో, వీడియో, కాల్డేటా ఆధారంగా విచారణ జరుపనుంది.