హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలోని 9,937 ప్రభుత్వ స్కూళ్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటి పర్యవేక్షణ కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్గా.. రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ కన్వీనర్గా... ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్పీడీసీఎల్ చైర్మన్, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్లను సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్ధేశించిన ప్రభుత్వ స్కూళ్లలో రూ. 289.25 కోట్లతో చేపట్టబోయే సోలార్ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన సోలార్ పవర్ సిస్టమ్ల డిజైన్, సరఫరా, ఇన్స్టాలేషన్, కమీషనింగ్ పనులను ఈ కమిటీ నిర్వహిస్తుంది.
