
హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్ హై ప్రెసిషన్ గేర్స్, గేర్ బాక్సెస్ తయారీ కోసం స్కంద ఏరోస్పేస్ కొత్త మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. డొమెస్టిక్ ఎయిర్క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు, గ్లోబల్ కమర్షియల్ ఏవియేషన్ మార్కెట్ కోసం గేర్స్, గేర్బాక్సుల తయారీకి రూ. 75 కోట్ల ఖర్చుతో ఈ కొత్త ఫెసిలిటీ ప్రారంభించినట్లు స్కంద ఏరోస్పేస్ వెల్లడించింది.
రాబోయే 2–3 ఏళ్లలో మరో రూ. 150 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. అమెరికా కంపెనీ రేవ్ గేర్స్, హైదరాబాద్ కంపెనీ రఘువంశీ మెషిన్ టూల్స్ కలిసి స్కంద ఏరోస్పేస్ను నెలకొల్పాయి. స్కంద ఏరోస్పేస్కు ఏటా 9 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడానికి రేవ్గేర్స్ ఒప్పుకుందని కంపెనీ పేర్కొంది. మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో ప్రస్తుతం 150 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ సంఖ్యను మూడేళ్లలో వెయ్యికి పెంచుతారు.