స్కంద ఏరోస్పేస్​ ఫెసిలిటీలో ప్రొడక్షన్​ షురూ

స్కంద ఏరోస్పేస్​ ఫెసిలిటీలో  ప్రొడక్షన్​ షురూ

హైదరాబాద్​, వెలుగు: ఏరోస్పేస్​ హై ప్రెసిషన్​ గేర్స్​, గేర్​ బాక్సెస్​ తయారీ కోసం స్కంద ఏరోస్పేస్​ కొత్త మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీని హైదరాబాద్​లో ఏర్పాటు చేసింది. డొమెస్టిక్​ ఎయిర్​క్రాఫ్ట్స్​, హెలికాప్టర్లు, గ్లోబల్​ కమర్షియల్​ ఏవియేషన్​ మార్కెట్​ కోసం గేర్స్​, గేర్​బాక్సుల తయారీకి రూ. 75 కోట్ల ఖర్చుతో ఈ కొత్త ఫెసిలిటీ ప్రారంభించినట్లు స్కంద ఏరోస్పేస్​ వెల్లడించింది. 

రాబోయే 2–3 ఏళ్లలో మరో రూ. 150 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. అమెరికా కంపెనీ రేవ్​ గేర్స్​, హైదరాబాద్​ కంపెనీ రఘువంశీ  మెషిన్​ టూల్స్​ కలిసి స్కంద ఏరోస్పేస్​ను నెలకొల్పాయి. స్కంద ఏరోస్పేస్​కు ఏటా 9 మిలియన్​ డాలర్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడానికి రేవ్​గేర్స్​ ఒప్పుకుందని కంపెనీ పేర్కొంది. మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో ప్రస్తుతం 150 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ సంఖ్యను మూడేళ్లలో వెయ్యికి పెంచుతారు.