- మెహిదీపట్నంలో పిల్లర్లు దాటని పరిస్థితి
సికింద్రాబాద్, వెలుగు: వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల కోసం ఉప్పల్, మెహిదీపట్నం ప్రాంతాల్లో చేపట్టిన స్కైవాక్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నర కింద మొదలైన నిర్మాణాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తికావాల్సి ఉంది. అధికారులు చెప్పిన టైం దాటిపోయి ఆర్నెళ్లు అవుతోంది. ఈ ఏడాది చివరికైనా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో రోడ్లు దాటాలంటే చాలా కష్టంగా ఉంటోంది.
జీబ్రా క్రాసింగులు ఉన్నప్పటికీ మితిమీరిన వేగంతో, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసేవారితో ప్రమాదాలు జరుగుతున్నాయి. దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, కోఠి, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్సిటీ ప్రాంతాల్లోనూ స్కైవాక్ లు నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. పైలట్ప్రాజెక్టు కింద ఉప్పల్, మెహిదీపట్నం ప్రాంతాల్లో పనులు స్టార్ట్చేశారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మొదటి దశ పనులు ఇంతవరకు పూర్తికాలేదు.
మెహిదీపట్నంలో రూ.28 కోట్లతో..
మెహిదీపట్నం జంక్షన్ లో 380 మీటర్ల మేర రూ.28కోట్ల అంచనాతో స్కైవాక్పనులు ప్రారంభించారు. ఇది గుడిమల్కాపూర్ వెళ్లే చౌరస్తా నుంచి మెహిదీపట్నం బస్టాండ్ మీదుగా పీవీ ఎక్స్ప్రెస్వే, మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్వరకు నిర్మిస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న బస్టాండ్లను కలుపుతూ సరికొత్తగా డిజైన్చేశారు. స్కైవాక్వెడల్పు 3.6 మీటర్లు ఉంటుంది. మొత్తం 16 లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు.
అయితే పనులు మొదలయ్యాక డిజైన్లో మార్పులు చేయడం, భూనిర్వాసితుల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం కొన్ని పిల్లర్లు మాత్రమే వేశారు. మధ్యలో కొంతకాలం ఆగిన పనులు ఇటీవలే తిరిగి మొదలయ్యాయి. పనులు ఇదే విధంగా కొనసాగితే పూర్తవడానికి మరో ఏడాదిన్నర పడుతుందని స్థానికులు అంటున్నారు.
రూ.35 కోట్లతో ఉప్పల్లో..
సిటీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ జంక్షన్ఒకటి. ఎల్నగర్, వరంగల్ వైపు వెళ్లే ప్రతి వెహికల్ఇటుగానే వెళ్లాల్సి ఉంది. ఇక్కడ రోడ్డు దాటాలంటే పాదచారులకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్పెట్టేందుకు నాలుగు రోడ్లను కలుపుతూ రూ.35 కోట్లతో 660 మీటర్ల పొడవు, 9.25 మీటర్ల ఎత్తు, 3 నుంచి 4 మీటర్ల వెడల్పులో స్కైవాక్నిర్మిస్తున్నారు. నాగోలు రోడ్డు వైపు మెట్రో స్టేషన్, రామంతపూర్ రోడ్, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ఆఫీస్సమీపంలోని థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్, పోలీస్స్టేషన్, సబ్స్టేషన్ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్పాయింట్లు పెడుతున్నారు. ఎనిమిది లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు, వాటిని ఆనుకుని ఆరు మెట్ల దారులు నిర్మిస్తున్నారు. 2021లో ప్రారంభమైన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మే నాటికి పూర్తిచేస్తామని హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించాక మరో మూడు నెలలు గడిచిపోయాయి. కానీ ఇంకా 40 శాతం పనులు చేయాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు.