ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా బంద్‌

ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా బంద్‌


    వచ్చే నెల 10 నుంచి అమలు.. చట్టం తీసుకొచ్చామన్న ప్రధాని అల్బనీస్‌ 
    16 ఏండ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, 
ఎక్స్‌, స్నాప్‌చాట్‌, యూట్యూబ్‌ వంటివి నో యాక్సెస్​

కాన్‌‌బెర్రా: ఆస్ట్రేలియాలో 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్‌‌ మీడియా వాడకంపై నిషేధాన్ని డిసెంబర్‌‌‌‌ 10 నుంచి అమల్లోకి తెస్తామని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌‌ తెలిపారు. నవంబర్‌‌‌‌ 2024లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని ‘వరల్డ్‌‌ లీడింగ్‌‌ సోషల్ మీడియా’గా కొనియాడారు. ఇది పిల్లల బాల్యాన్ని రక్షించడంతో పాటు తల్లిదండ్రులను వారికి మరింత దగ్గర చేస్తోందని పేర్కొన్నారు. 

ఆన్‌‌లైన్‌‌ సెఫ్టీ అమెండ్‌‌మెంట్ (సోషల్‌‌ మీడియా మినిమమ్‌‌ ఏజ్‌‌) బిల్లు– 2024.. డిసెంబర్‌‌‌‌ 10న చట్టంగా రూపుదిద్దుకోనుంది. ఈ చట్టం 16 ఏండ్ల లోపు పిల్లలకు ఇన్‌‌స్టాగ్రామ్‌‌, ఫేస్‌‌బుక్‌‌, టిక్‌‌టాక్‌‌, ఎక్స్‌‌, స్నాప్‌‌చాట్‌‌, యూట్యూబ్‌‌, రెడ్‌‌ఇట్‌‌, కిక్‌‌ వంటి అనేక ప్లాట్‌‌ఫారమ్స్‌‌ను ఉపయోగించకుండా నియంత్రిస్తుంది. ఈ సందర్భంగా అల్బనీస్‌‌ మాట్లాడుతూ.. ‘‘ఒక నెల రోజుల్లో దేశంలో సోషల్ మీడియా చట్టం అమల్లోకి రానుంది. ఇది పిల్లలను పిల్లలుగా ఉండనివ్వనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల, లక్ష్యాల గురించి వారితో చర్చించే అధికారం ఇవ్వనుంది”అని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం మైనర్‌‌‌‌ పిల్లలకు సోషల్‌‌ మీడియాలో అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని 
ఆయా కంపెనీలకు సూచించారు.