జొమాటో షేర్లు అమ్మిన సాఫ్ట్​బ్యాంక్

జొమాటో షేర్లు అమ్మిన సాఫ్ట్​బ్యాంక్

న్యూఢిల్లీ: జొమాటోలోని తన 10 కోట్ల షేర్లను సాఫ్ట్​బ్యాంక్​ విజన్​ గ్రోత్​ఫండ్​ అమ్మింది. మంగళవారం బ్లాక్​డీల్​ ద్వారా అమ్మకం పూర్తయింది. షేరుకు రూ.94 చొప్పున రూ.940 కోట్ల విలువైన షేర్లను అమ్మింది. జొమాటోలోని మరో ఫారిన్​ ఇన్వెస్టర్​ టైగర్​ గ్లోబల్​ మేనేజ్​మెంట్​ కూడా రూ.1,123 కోట్ల విలువైన 1.44 శాతం వాటాను అమ్మేసింది.