
న్యూఢిల్లీ: జొమాటోలోని తన 10 కోట్ల షేర్లను సాఫ్ట్బ్యాంక్ విజన్ గ్రోత్ఫండ్ అమ్మింది. మంగళవారం బ్లాక్డీల్ ద్వారా అమ్మకం పూర్తయింది. షేరుకు రూ.94 చొప్పున రూ.940 కోట్ల విలువైన షేర్లను అమ్మింది. జొమాటోలోని మరో ఫారిన్ ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ కూడా రూ.1,123 కోట్ల విలువైన 1.44 శాతం వాటాను అమ్మేసింది.