పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కు వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కు వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
  • మృతుడు వరంగల్ వాసి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

గండిపేట్,వెలుగు : పాస్ట్ పోర్టు వెరిఫికేషన్ కు వచ్చిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందిన  ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వరంగల్‌ కు చెందిన మణిరాజ్‌(30)  పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ కు  శనివారం సిటీకి వచ్చి అల్కాపూర్‌లోని తన ఫ్రెండ్ చాణిక్య ప్లాట్‌లో ఉన్నాడు. ఆ రోజు మణిరాజ్‌ సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి ఉత్సాహంగా గడిపారు. అనంతరం రాత్రి ఫ్లాట్ కు వెళ్లాడు. ఆదివారం ఉదయం చాణిక్య లేచేసరికి మణిరాజ్‌ బాత్‌రూమ్‌లో ఉండగా తలుపు తట్టగా ఎంతకీ తీయలేదు. దీంతో ఆందోళనకు గురైన చాణిక్య వాచ్‌మెన్, పక్క ఫ్లాట్ వారిని  పిలిచాడు. వెళ్లి బాత్‌రూమ్‌ డోర్ బద్దలు కొట్టి చూడగా మణిరాజ్‌ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. 

వెంటనే 108కు సమాచారం అందించగా వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని సిబ్బంది నిర్ధారించారు. మణిరాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుండెపోటుతో మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.