
హైదరాబాద్: వైరా మండల పరిధిలోని గొల్లపూడి గ్రామానికి చెందిన దొబ్బల రమేష్, కర్నాటి అశోక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడే మోసగాళ్లకు డేటాను అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఈ ఇద్దరినీ విచారించి పోలీసులు వదిలేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు.