సాఫ్ట్ వేర్ జాబ్స్ లేక టీచర్ జాబ్స్ వైపు చూపు
సొంత ఊరిలో ఎక్కువ శాలరీతో పని చేయొచ్చనే భావన
ఈ ఏడాది బీఈడీలో చేరిన 586 మంది బీటెక్ స్టూడెంట్స్
హైదరాబాద్, వెలుగు: మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతో బీటెక్ స్టూడెంట్లు కూడా బీఈడీ వైపు అడుగులు వేస్తున్నారు. నాలుగేండ్ల పాటు బీటెక్ చదివినా.. సొంత ఊరికి దూరంగా ఉండే బదులు.. ఇంటి పట్టునే ఉండి ఆ మాత్రం శాలరీ వస్తే చాలనుకుని టీచర్ జాబ్ల మీద దృష్టి పెడుతున్నారు. రెండేండ్లుగా బీటెక్ నుంచి బీఈడీలో చేరుతున్న స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది.
సొంత ఊరిలో జాబ్కే ప్రయారిటీ
రాష్ట్రంలో ఏటా 80 వేల మంది వరకూ బీటెక్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన వారికి ఒకప్పుడు మంచి డిమాండ్ఉన్నా, ఇప్పుడు హవా తగ్గడంతో, ఉద్యోగ అవకాశాలూ తగ్గిపోయాయి. కొన్ని కాలేజీల్లో క్యాంపస్సెలక్షన్స్ తో కొందరు మెరిట్ స్టూడెంట్స్ కు జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. మొత్తంగా చూస్తే బీటెక్ పూర్తి చేసి బయటకొచ్చిన వారిలో సగం మందే ఏదో ఓ కంపెనీలో జాబ్చేస్తుండగా, మిగిలిన సగం మంది జాబ్స్ రాక అవస్థలు పడుతున్నారు. బీటెక్ చేసిన కొందరికి టీచర్ జాబ్ చేసేందుకు ఇష్టమున్నా, ఆ జాబ్కు బీఈడీ కోర్సుతో పాటు టెట్ తప్పనిసరి. దీంతో వారు బీఈడీలో చేరేందుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
వెయ్యికిపైగా ఎడ్సెట్కు..
గతేడాది బీటెక్ చేసిన వెయ్యి మంది వరకూ ఎడ్సెట్ కు హాజరైనా, 200 మంది బీఈడీలో చేరినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది బీటెక్చేసిన 1,210 మంది ఎడ్సెట్కు అప్లై చేస్తే 586 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం బీఈడీ మ్యాథమెటిక్స్లో మొత్తం 3,242 మంది చేరితే వారిలో బీటెక్ నుంచి వచ్చిన వారే 444 మంది. ఫిజికల్సైన్స్లో 1,421 మంది చేరితే వారిలో బీటెక్ నుంచి వచ్చిన వారు142 మంది. ఈ లెక్కన ఆయా కోర్సుల్లో పదిశాతానికిపైగానే బీటెక్పూర్తి చేసిన వారే.
టీచర్ జాబ్ కోసమే
గతేడాది బీటెక్ పూర్తయింది. చాలా తిరిగినా అనుకున్న జీతానికి జాబ్దొరకలేదు. హైదరాబాద్ వెళ్లి జాబ్ చేసే కంటే ఉన్న ఊరిలోనే అంతే జీతంతో జాబ్చేయాలని నిర్ణయించుకున్నా. ఓ స్కూల్లో మ్యాథ్స్ ట్యూషన్ చెప్తున్నా. టీచర్ కావాలంటే బీఈడీ, టెట్ అవసరం. అందుకే చేస్తున్న. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బీఈడీ చేస్తున్నరు.
– ప్రణయ్, నిజామాబాద్