సోమేశ్​ ఏపీకి వెళ్లాలి: బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి

సోమేశ్​ ఏపీకి వెళ్లాలి: బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎస్ సోమేశ్​కుమార్​ పోస్టింగ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాష్ట్ర సర్కారు, సీఎం కేసీఆర్​కు చెంపపెట్టులాంటిదని బీజేపీ సీనియర్​నేత గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తీర్పును గౌరవించి సోమేశ్​ఏపీకి వెళ్లాలని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన డిమాండ్​ చేశారు.

సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం అవినీతి అధికారులకు అడ్డాగా మారిందని నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమేశ్ లాంటి అధికారుల అండతోనే  కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కేడర్​ ఐఏఎస్​ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా సీఎస్ నియామకం జరిగిందని వెల్లడించారు.