
హైదరాబాద్, వెలుగు: సీఎస్ సోమేశ్కుమార్ పోస్టింగ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాష్ట్ర సర్కారు, సీఎం కేసీఆర్కు చెంపపెట్టులాంటిదని బీజేపీ సీనియర్నేత గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తీర్పును గౌరవించి సోమేశ్ఏపీకి వెళ్లాలని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం అవినీతి అధికారులకు అడ్డాగా మారిందని నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమేశ్ లాంటి అధికారుల అండతోనే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కేడర్ ఐఏఎస్ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా సీఎస్ నియామకం జరిగిందని వెల్లడించారు.