
హైదరాబాద్ : తనకు వచ్చిన క్యాన్సర్ గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం వల్ల చాలా ప్రేమను పొందానని తెలిపారు నటి సోనాలిబింద్రే. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన స్విచ్ ఆన్ ది సన్ షైన్ కార్యక్రమానికి సోనాలి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..”అసలు నాకు ఇలా అవుతుంది అని అనుకోలేదు. ఎలా అయింది. ఇధి అంత ఒక కల అయి ఉంటే బాగుండు అనుకున్నా. నా గురించి చాలా రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో నా క్యాన్సర్ గురించి షేర్ చేసుకోవడం వల్ల…. ఫ్యాన్స్ నుండి చాలా ప్రేమని పొందాను. క్యాన్సర్ పేషెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. పేషెంట్స్ ఒంటరిగా ఉండకుండా అందరితో కలవాలి, మాట్లాడాలి. అన్నిటి కంటే ముందుగా మనతో మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. క్యాన్సర్ అనేది ఎవరికీ అయినా వస్తుంది…..కాబట్టి రెగ్యులర్ గా చెక్ ఆప్స్ చేయించుకోవాలి.
ప్రతి ఒక్కరికి వాళ్ల జీవితాలలో ఒడిదుడుకులు ఉంటాయి. నా జీవితానికి నా భర్త పిల్లర్ లాంటి వారు. నా కుటుంబ సభ్యులు నా ఈ జర్నీలో నాకు తోడుగా ఉండి సహాయం చేశారు. యోగ, మెడిటేషన్ చేయడం వల్ల బలహీనతల నుండి బయటపడవచ్చు. క్యాన్సర్ కంటే ట్రీట్మెంటే చాలా భయంకరమైంది. కచ్చితంగా అందరు జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. దాని వల్ల క్యాన్సర్ ని తొందరగా పసి గట్టి క్యూర్ చేయింఛవచ్చు” అని తెలిపారు సోనాలిబింద్రె.