
న్యూఢిల్లీ: గాజా, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఖండించారు. సైనిక చర్యలను మారణ హోమం, క్రూరమైన చర్యలుగా అభివర్ణించారు. ఆ రెండు దేశాల్లో ఇజ్రాయెల్ విధ్వంసంపై భారత్ స్పందించకపోవడంపై ఆమె మండిపడ్డారు.
ఇది భారతదేశ విలువలను కోల్పోవడమేనన్నారు. దీనిపై భారత్ మౌనం దౌత్య వైఫల్యమని విమర్శించారు. భారత్ మౌనంగా ఉండటం దాడులను సమర్థించడమే అనుకోవాల్సి ఉంటుందని ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో రాసిన ఆర్టికల్లో ఆమె పేర్కొన్నారు.