ఇరాన్, గాజాపై దాడులను భారత్ ఖండించాలి: సోనియా

ఇరాన్, గాజాపై దాడులను భారత్ ఖండించాలి: సోనియా

న్యూఢిల్లీ:  గాజా, ఇరాన్‌‌పై ఇజ్రాయెల్‌‌ దాడులను కాంగ్రెస్‌‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌‌‌పర్సన్‌‌ సోనియా గాంధీ ఖండించారు. సైనిక చర్యలను మారణ హోమం, క్రూరమైన చర్యలుగా అభివర్ణించారు. ఆ రెండు దేశాల్లో ఇజ్రాయెల్‌‌ విధ్వంసంపై భారత్‌‌   స్పందించకపోవడంపై ఆమె మండిపడ్డారు. 

ఇది భారతదేశ విలువలను కోల్పోవడమేనన్నారు. దీనిపై  భారత్ మౌనం దౌత్య వైఫల్యమని విమర్శించారు. భారత్‌‌ మౌనంగా ఉండటం దాడులను సమర్థించడమే అనుకోవాల్సి ఉంటుందని ఈ మేరకు ఓ  ఆంగ్ల పత్రికలో రాసిన ఆర్టికల్‌‌లో ఆమె పేర్కొన్నారు.