
ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మరణంపై UPA చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తీవ్రమైన ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ వ్యవహారాల్లో తనకు ఎన్నోసార్లు షీలాదీక్షిత్ మద్దతుగా నిలిచారని అన్నారు. షీలాదీక్షిత్ తనకు ఓ అక్కగా మెలిగేవారన్నారు. ఓ ఫ్రెండ్ గా ఆమె స్నేహాన్ని మరిచిపోలేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని చెప్పారు. షీలాదీక్షిత్ ను తాను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటానని చెప్పారు సోనియాగాంధీ.