
- ఫస్ట్ టైం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలి క్యాంపెయిన్
- బెంగళూరులో మోడీ రెండు రోజుల రోడ్షో
- 17 సెగ్మెంట్స్ కవర్ చేసేలా బీజేపీ లీడర్ల ఏర్పాట్లు
బెంగళూరు: కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హుబ్లీలో నిర్వహించే మెగా ర్యాలీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరవుతున్నారు. హుబ్లీ–ధార్వాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి మహేశ్ టెంగింకై పోటీ చేస్తున్నారు. రెండు పార్టీల లీడర్లు ఈ సెగ్మెంట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ‘‘శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సోనియా గాంధీ హుబ్లీకి వస్తారు. ఎలక్షన్ ర్యాలీలో పాల్గొని 3.30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు”అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ టైం కర్నాటక ఎన్నికల క్యాంపెయిన్లో సోనియా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ లీడర్లు రాహుల్, ప్రియాంక విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.