ముంబై: ప్రముఖ బ్రాడ్కాస్టర్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ)తో తమ మీడియా రైట్స్ కాంట్రాక్టును మరో మూడు సీజన్లకు పునరుద్ధరించింది. ఈ ఒప్పందంలో భాగంగా 2027 వరకు ప్రఖ్యాత చాంపియన్స్ లీగ్తో పాటు యూరప్కు చెందిన పలు లీగ్స్లో 1600 ఫుట్బాల్ మ్యాచ్లను ఇండియాలో టీవీ, ఓటీటీల్లో లైవ్ కవరేజ్ ఇవ్వనుంది.
