చిరంజీవి ఆచార్య సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్

చిరంజీవి ఆచార్య సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్

సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద పడి అలమటిస్తుంటే.. ఆకలి దప్పులకు తాళలేక వందలు, వేల కిలోమీటర్లు కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. నేనున్నానంటూ అలాంటి వారిని ఆదుకున్న వ్యక్తి సోనూసూద్. ఆపదలో.. కష్టాల్లో ఉన్న వారికి.. జీవితంలో ఎదగడానికి, స్థిరపడటానికి అష్టకష్టాలు పడుతుండే వారి గురించి సామాజిక మాధ్యమాల్లో తెలిసినా వెంటనే స్పందించి సోనూ సూద్ చేస్తున్న సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరోనా తొలి దశ తర్వాత మళ్లీ మామూలు పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కలకలం రేపుతున్నా సోషల్ డిస్టెన్స్.. మాస్క్ ధరించాలన్న నిబంధనలు తప్పనిసరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్యలో ‘‘సోనుసూద్’’ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు బుధవారం తెల్లవారుజామునే సోనుసూద్  సైకిల్ మీద వెళ్లడం విశేషం. సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి. కొందరు సోనూసూద్ ను గుర్తించి హాయ్ చెప్పగా.. చిరునవ్వుతోనే బదులిస్తూ.. హుషారుగా సాగిపోయాడు సోనూసూద్.