లాక్ డౌన్ కాలంలో నటుడు సోనూసూద్ ముందు నుండి మంచి మనసు చాటుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా వలస కార్మికుల పట్ల ఉదారత చూపిస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం కోసం తన సొంత ఖర్చుతో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు.
దీనికోసం ఆయన స్వయంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని రవాణా సౌకర్యం కల్పించాడు. సోమవారం ఈ బస్సులు థానే, (మహారాష్ట్ర), గుల్బర్గా (కర్ణాటక) నుంచి బయలుదేరాయి. సోనూసూద్ వారికి గుడ్ బై చెబుతూ తన ఉదారతను చాటుకున్నాడు. స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రియల్ హీరో అంటూ సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.