సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ( సైబరాబాద్ ) పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు లో ఓ కాంగ్రెస్ నాయకుడి ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్న 16 మందిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు, రూ. 13.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ కు చెందిన ఫామ్ హౌస్ గా గుర్తించారు. నిన్న రాత్రి ఫాంహౌస్ లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. మరికొందరు పోలీసులను చూసి పారిపోయినట్టు తెలుస్తోంది. .
స్థానికుల సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు, ఎస్ ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు జరపడంతో పేకాట భాగోతం బయటపడింది.ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు