- వచ్చే నెల 16న కోల్కతాలో లెజెండ్స్ లీగ్ స్పెషల్ మ్యాచ్
- ఇండియా టీమ్కు కెప్టెన్గా దాదా
న్యూఢిల్లీ: ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. తన హోమ్గ్రౌండ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో బరిలోకి దిగబోతున్నాడు. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్ఎల్సీ) రెండో సీజన్లో ఇండియా మహారాజాస్– వరల్డ్ లెజెండ్స్ జట్ల మధ్య ఓ ప్రత్యేక మ్యాచ్ను ఏర్పాటు చేశారు.
వచ్చే నెల16న ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ పోరులో ఇండియాకు గంగూలీ, వరల్డ్ లెజెండ్స్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తారు. కాగా, ఎల్ఎల్సీ రెండో సీజన్ను 75వ స్వాతంత్య్ర వేడుకలకు అంకితం చేస్తున్నట్టు లీగ్ కమిషనర్ రవిశాస్త్రి ప్రకటించాడు. నాలుగు జట్లతో కూడిన ఈ లీగ్ రెండో సీజన్ సెప్టెంబర్ 17న మొదలవుతుందని చెప్పాడు. అక్టోబర్ 8 వరకు టోర్నీ జరుగుతుందన్నాడు.