సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు తేలిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన సఫారీ జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 100 పరుగుల టార్గె్ట్ ఉంది. సౌతాఫ్రికాలో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా, ఏడుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, సిరాజ్, షాబాజ్ 2 చొప్పున వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే సిరీస్ లో చెరో మ్యాచ్ ని ఇరుజట్లు గెలిచాయి.