
బెంగళూరు: సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్షిప్లో ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్ బెర్త్ టార్గెట్గా శనివారం జరిగే సెమీఫైనల్లో బలమైన లెబనాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే కెప్టెన్ సునీల్ ఛెత్రి మరోసారి మెరవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ టోర్నీలో హ్యాట్రిక్తో కలిపి మొత్తం ఐదు గోల్స్ చేసిన అతను టాప్ ప్లేస్లో ఉన్నాడు. సాహల్ అబ్దుల్ సమద్, మహేశ్ సింగ్, ఉదాంత్ సింగ్ కూడా కీలకం కానున్నారు.
మరోవైపు గ్రూప్–బిలో టాప్ ప్లేస్లో నిలిచిన లెబనాన్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇండియాతో లెబనాన్ ఇప్పటి వరకు ఏడుసార్లు తలడి 3–2 లీడ్లో ఉంది. మరోవైపు కువైట్తో మ్యాచ్లో అఫీషియల్స్తో గొడవ పడిన కారణంగా ఇండియా కోచ్ ఇగోర్ స్టిమాచ్పై రెండు మ్యాచ్ల బ్యాన్ పడింది. దాంతో అతను సెమీస్కు దూరంగా ఉండటం ఛెత్రిసేనకు మైనస్ కానుంది. మరో సెమీస్ మ్యాచ్లో కువైట్తో బంగ్లాదేశ్ తలపడుతుంది