భోళా శంకర్ విడుదలపై స్టే? కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్

భోళా శంకర్ విడుదలపై స్టే? కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్

విడుదలకు ముందే భోళా శంకర్ టీమ్ భారీ షాక్ తగిలింది. భోళా శంకర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కోర్టుకెక్కారు. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనియ్యాంశం అయ్యింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనిల్ నిర్మాణంలో వచ్చిన ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాను గాయత్రీ ఫిల్మ్స్ యజమాని డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ భారీ ధరకు కొనుగోలు చేశారు. కానీ విడుదల తరువాత చాలా నష్టం ఏర్పడింది. 

దాంతో అనిల్ సుంకర నిర్మించిన తరువాతి సినిమా సామజవరగమన హక్కులను కూడా వైజాగ్ సతీష్ కే ఇచ్చారు అనిల్ సుంకర. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఏజెంట్ కు లాస్ అయినా అమౌంట్ ఇంకా రాలేదని, ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ కు ఉందని, తన అమౌంట్ ను క్లియర్ అయ్యే వరకు సినిమాను ఆపివేయాలని కోర్టును కోరారు. ఇక మరోవైపు, సతీష్ సమర్పించిన పంపిణీ ఒప్పంద పత్రం నకిలీదని ప్రొడక్షన్ హౌస్ కోర్టులో పేర్కొంది. మరి ఇరు పార్టీల వాదనలు విన్న తరువాత కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

ఇక భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.