2500 ఎకరాల్లో సోయాబీన్ సాగు : చంద్రశేఖర్

2500 ఎకరాల్లో సోయాబీన్ సాగు : చంద్రశేఖర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: జాతీయ నూనె గింజల పథకం కింద మొగుడంపల్లి, కోహీర్, నారాయణఖేడ్ మండలాల్లో 2,500 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేయడానికి జిల్లా స్థాయి కమిటీలు తీర్మానం చేసినట్లు అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఏఎస్పీ సంజీవరావుతో కలిసి వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్​సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఈ ఏడాదికి 25 ఎకరాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అధికారులకు సూచించారు. 

డీఏవో శివప్రసాద్ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్​షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి క్రయ విక్రయాలు జరపాలన్నారు. అడిషనల్ ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ డీలర్లు అందరూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే అమ్మకాలు కొనసాగించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.