అసెంబ్లీలో కోవిడ్ రూల్స్ పాటించని మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డిలకు చురకలంటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కోవిడ్ రూల్స్ పాటించకుండా సభా సమయంలో ఈటెల పక్కన ఉన్న నో-సీటింగ్ ఛైర్ లో మంత్రి జగదీష్ రెడ్డి వచ్చి కూర్చున్నారు. మంత్రులను గమనించిన స్పీకర్ నో-సీటింగ్ సీట్ లో కూర్చోవద్దన్నారు. స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటెల దగ్గర నుంచి వెళ్లిపోయారు మంత్రి జగదీష్ రెడ్డి. సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు స్పీకర్.
కరోనా పంజా.. ఒకే రోజు 95,735 కేసులు..1172 మరణాలు