శ్రీరామ నవమికి స్పెషల్​ బస్సులు

శ్రీరామ నవమికి స్పెషల్​ బస్సులు

ఖమ్మం టౌన్, వెలుగు: ఏప్రిల్ 10న భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి పండుగకు రాష్ట్రంలోని వివిధ ఏరియాల నుంచి స్పెషల్​ బస్సులు నడపనున్నారు. కరీంనగర్ జోన్ ఈడీ వీర్ల వెంకటేశ్వర్లు స్పెషల్​ బస్సులపై ఖమ్మం సిటీలోని కొత్త బస్టాండ్​లో సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 9 నుంచి 11 వరకు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ రీజియన్ల నుంచి 350, ఏపీలోని కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి 355 బస్సులు నడపనున్నట్లు చెప్పారు. మొత్తం 705 స్పెషల్ బస్సులు తిరుగుతాయన్నారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు రూ.50, భద్రాచలం నుంచి రాజమండ్రికి రూ.200, ఖమ్మం నుంచి భద్రాచలం రూ.140, హైదరాబాద్ నుంచి భద్రాచలానికి రూ.350 టిక్కెట్​ధర నిర్ణయించారు. సమీక్షలో ఖమ్మం, వరంగల్ జిల్లా, ఏపీ అధికారులు పాల్గొన్నారు.