GHMCలో అందరికీ టీకాలే లక్ష్యంగా స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖ, GHMC, కంటోన్మెంట్ బోర్డులు ఉమ్మడిగా ఈ ప్రక్రియను చేపట్టాయి. విస్తృతంగా జరగనున్న ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందజేయనున్నారు.ఇందుకోసం మొబైల్ వ్యాక్సిన్ వెహికిల్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. మొబైల్ వాహనాలతో వీధుల్లో తిరుగుతూ GHMC జీహెచ్ఎంసీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారు. GHMC పరిధిలోని 4846 కాలనీలు, బస్తీలతో పాటు కంటోన్మెంట్లోని 360 బస్తీలు, కాలనీల్లో డ్రైవ్ చేపట్టారు.
ఇప్పటికే గ్రేటర్లో 70 శాతానికి పైగా అర్హులైన 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తియిందని అధికారులు తెలిపారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఏ ఒక్కరినీ వదలకుండా వంద శాతం వ్యాక్సిన్ ఇప్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 175 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వాహనాలను సిద్ధం చేశారు. సుమారు 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.