మోడిఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్​ డ్రైవ్

మోడిఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్​ డ్రైవ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్​ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఖమ్మం నగరంలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లను గురువారం ఆయన మీడియాకు చూపించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించిన వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధిస్తున్నామని చెప్పారు. లైసెన్సు లేకుండా వెహికల్​ నడిపినా, నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకున్నా కేసులు నమోదు  చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ మోహన్ బాబు, ఎస్సై రవి, సాగర్ పాల్గొన్నారు.