సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదానం

సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదానం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. గుట్ట పై ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప, దుర్గామాత మందిరాల్లో పురోహితులు కుమార్ శర్మ, నందీశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

రామాలయం నుంచి జీవ కోనేరు వరకు పల్లకీసేవ జరిగింది. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.