ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకులూ రికార్డు కొట్టిన్రు..

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకులూ రికార్డు కొట్టిన్రు..

ప్రపంచంలోనే అతి పెద్దదైన  అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌‌కు  హాజరైన ప్రేక్షకులు రికార్డు సాధించారు. 1.10 లక్షల కెపాసిటీ ఉన్న ఈ స్టేడియానికి ఆదివారం  లక్షా 4 వేల 859 మంది ప్రేక్షకులు హాజరైనట్టు అధికారికంగా ప్రకటించారు.  వైట్ బాల్ ( వన్డే, టీ20) ఫార్మాట్‌‌లో ఓ మ్యాచ్‌‌కు ఇదే రికార్డు అటెండెన్స్‌‌.1993లో ఈడెన్ గార్డెన్‌‌లో ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌‌కు లక్ష మంది హాజరైన రికార్డు ఇప్పుడు బ్రేక్‌‌ అయింది.